సంగెం సొసైటీ ఎన్నికలు ప్రశాంతం

ABN , First Publish Date - 2021-04-17T05:32:51+05:30 IST

సంగెం సొసైటీ ఎన్నికలు ప్రశాంతం

సంగెం సొసైటీ ఎన్నికలు ప్రశాంతం
గెలుపొందిన అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాలను అందిస్తున్న అధికారులు

టీఆర్‌ఎస్‌కు 12, కాంగ్రెస్‌కు 1 స్థానాలు

సంగెం, ఏప్రిల్‌ 16: సంగెం ప్రాథమిక వ్య వసాయ సహకార సంఘానికి జరిగిన ఎన్ని కల్లో టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులు గెలు పొందారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన పోలిం గ్‌లో సొసైటీ పరిధిలోని పలు గ్రామాలకు చెందిన ఓటర్లు తమ ఓటుహక్కును విని యోగించుకున్నారు. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పర్వతగిరి సీఐ కిషన్‌, సంగెం ఎస్సై సురేష్‌లు బందోబస్తు నిర్వహించారు. సొసైటీలోఉన్న 13 స్థానాలకు ఎన్నికలు జరు గగా 12 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్య ర్థులు గెలుపొందగా, కాంగ్రెస్‌ ఒక స్థానాన్ని సాధించుకుంది. కాగా, శనివారం సొసైటీ పరిపాలన భవనంలో చైర్మన్‌, వైస్‌ చెర్మన్‌ల ఎన్నిక జరుగుతుందని ఎన్నికల అధికారి నాగనారాయణ తెలిపారు.

విజేతలు వీరే..

పులి వీరస్వామి, గోపతి రాజ్‌కుమార్‌, పో శాల మల్లయ్య, దామెర పరమలత, మెరుగు శ్రీనివాస్‌, కొట్టంరాజు, గుగులోతు రమ, సఫా వట్‌ కిషన్‌నాయక్‌, ఇమ్మడి ప్రవీణ్‌, జనగాం రమేశ్‌, జాటోతు యిరాం, కడారి సులోచన, వేల్పుల కుమా రస్వామి యాదవ్‌ గెలుపొందినట్లు ఎన్నికల అధికారి వివరించారు.


Updated Date - 2021-04-17T05:32:51+05:30 IST