Telangana: వట్‌పల్లి తహశీల్దార్ కార్యాలయంలో అక్రమాలు

ABN , First Publish Date - 2022-03-15T19:31:46+05:30 IST

జిల్లాలోని వట్‌పల్లి తహశీల్దార్ కార్యాలయంలో అక్రమాలు బయటపడ్డాయి.

Telangana: వట్‌పల్లి తహశీల్దార్ కార్యాలయంలో అక్రమాలు

సంగారెడ్డి: జిల్లాలోని వట్‌పల్లి తహశీల్దార్ కార్యాలయంలో అక్రమాలు బయటపడ్డాయి. బిజిలిపూర్ గ్రామస్థురాలు ఆరుగొండ విరమణెమ్మకు చెందిన రెండెకరాల భూమిని ఆమె బతికుండగానే అదే గ్రామానికి ఆరుగొండ సంగీత పేరుపై అధికారులు అక్రమంగా పౌతి మార్పు చేశారు. భాదితురాలు వీరమణెమ్మ చనిపోయిందంటూ మండల తహశీల్దార్ ప్రభువులు మరణధ్రువీకరణ పత్రం సృష్టించి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశాడు. విషయం తెలిసిన బాధితురాలు మీరమణెమ్మ తీవ్ర మనస్థాపానికి గురై తహశీల్దార్ కార్యాలయం ఎదుట పెట్రోల్ డబ్బాతో ఆందోళనకు దిగింది. మణెమ్మకు గ్రామస్థులు మద్దతు తెలిపారు. విషయం తెలిసిన ఆర్డీఓ విక్టర్ ఈ వ్యవహారంపై విచారణ చేపట్టారు. మండల తహశీల్దార్‌పై సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. 

Updated Date - 2022-03-15T19:31:46+05:30 IST