Telangana: తండ్రిని హత్య చేసిన కొడుకులు

ABN , First Publish Date - 2021-09-30T15:38:01+05:30 IST

ఆస్తి కోసం కన్న తండ్రినే పొట్టనపెట్టుకున్నారు కసాయి కొడుకులు.

Telangana: తండ్రిని హత్య చేసిన కొడుకులు

సంగారెడ్డి:  ఆస్తి కోసం కన్న తండ్రినే పొట్టనపెట్టుకున్నారు కసాయి కొడుకులు. ఈ ఘటన జిల్లాలోని ఆందోల్ మండలం బ్రాహ్మణ పల్లి గ్రామంలో చోటు  చేసుకుంది. గత అర్ధరాత్రి తండ్రి పెద్దగొల్ల పాపయ్య కొడుకులు నరేష్, కృష్ణ కలిసి హత్య చేసి పరారయ్యారు. అంతే కాకుండా మరో సోదరుడిని హత్య చేసుకుందుకు నరేష్, కృష్ణ యత్నించారు. ఈ ఘటనపై పెద్ద కుమారుడు విఠల్  జోగిపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మృతుడికి నలుగురు కుమారులు విఠల్, కృష్ణ, నరేష్, చిరంజీవి ఉన్నారు. ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-09-30T15:38:01+05:30 IST