Sangareddy: విద్యార్థిని చెప్పుతో కొట్టిన హెడ్మాస్టర్

ABN , First Publish Date - 2022-04-22T17:59:53+05:30 IST

జిల్లాలోని ఆందోల్ మండలం నెరడిగుంట ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో అమానుష ఘటన చోటు చేసుకుంది.

Sangareddy: విద్యార్థిని చెప్పుతో కొట్టిన హెడ్మాస్టర్

సంగారెడ్డి: జిల్లాలోని ఆందోల్ మండలం నెరడిగుంట ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఒకటవ తరగతి విద్యార్థి(సృజన్)ను ప్రధానోపాధ్యాయురాలు పారిజాతం చెప్పుతో కొట్టారు. తరగతి గదిలో విద్యార్థి అల్లరి చేస్తూ పరీక్షలు సరిగ్గా రాయడం లేదంటూ విద్యార్థిపై ప్రధానోపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలిసిన విద్యార్థి కుటుంబీకులు... ప్రధానోపాధ్యాయురాలిని నిలదీశారు. ఈ ఘటనపై ఆందోల్ మండల ఎంఇఓ, డిఇఓకు విద్యార్థి తండ్రి వీఆరోఓ వినోద్ ఫిర్యాదు చేశారు. అయితే పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు విద్యార్థిని చెప్పుతో కొట్టిన వ్యవహారాన్ని మండల విద్యాశాఖ అధికారి ఎంఇఓ కృష్ణ పట్టించుకోలేదు. ఎంఇఓ తీరుపై విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-04-22T17:59:53+05:30 IST