సింగూరు ప్రాజెక్ట్కు పెరిగిన వరద ఉధృతి
ABN , First Publish Date - 2020-09-17T13:07:12+05:30 IST
భారీ వర్షాలతో పుల్కల్ మండలం సింగూర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది.
సంగారెడ్డి: భారీ వర్షాలతో పుల్కల్ మండలం సింగూర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 45,282 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 120 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 29.917 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటిమట్టం 8.520 టీఎంసీలకు చేరుకుంది. నిన్న ఒక్కరోజే సింగూరులోకి 4 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది.