Sangareddy: చెరువు సరదా ఇద్దరిని బలి తీసుకుంది..మరో ముగ్గురి కోసం గాలింపు

ABN , First Publish Date - 2021-10-18T12:39:58+05:30 IST

అమీన్‎పూర్‎లో విషాదం చోటు చేసుకుంది. సరదాగా చెరువులోకి దిగిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళ్తే..అమీన్‎పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బందంకొమ్ము చెరువులోపడి ప్రమాదవశాత్తు ఇద్దరు

Sangareddy: చెరువు సరదా ఇద్దరిని బలి తీసుకుంది..మరో ముగ్గురి కోసం గాలింపు

సంగారెడ్డి: అమీన్‎పూర్‎లో విషాదం చోటు చేసుకుంది. సరదాగా చెరువులోకి దిగిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళ్తే..అమీన్‎పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బందంకొమ్ము చెరువులోపడి ప్రమాదవశాత్తు ఇద్దరు యువకులు మృతి చెందారు. అయితే..సరదాగా ఐదుగురు యువకులు పుట్టిలో కూర్చొని చెరువులోకి వెళ్లారు. ఒక్కసారిగా మధ్యలోనే పుట్టి మునగడంతో మొత్తం ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. ఐదుగురిలో ఇద్దరు మృతి చెందగా..మరో ముగ్గురికి కోసం గజ ఈతగాళ్లతో గాలిస్తున్నారు. మృతులు పవన్ (34), నర్సింహులు (36)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చెపట్టారు.

Updated Date - 2021-10-18T12:39:58+05:30 IST