అయ్యప్ప మాల వేసుకున్న విద్యార్థికి అవమానం
ABN , First Publish Date - 2021-11-23T17:01:09+05:30 IST
సంగారెడ్డి జిల్లా: సదాశివపేటలో ఓ స్కూల్లో అవమానకర ఘటన జరిగింది.
సంగారెడ్డి జిల్లా: సదాశివపేటలో ఓ స్కూల్లో అవమానకర ఘటన జరిగింది. అయ్యప్పస్వామి మాల వేసుకుని స్కూల్కు వెళ్లిన విద్యార్థిని లోపలకు అనుమతించబోమని యాజమాన్యం గంటపాటు బయటే నిల్చోబెట్టడడం వివాదాస్పదంగా మారింది. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు స్కూల్ ముందు ఆందోళన చేపట్టాయి. తమను ఇలా వేరుచేయడం తగదని విద్యార్థి తల్లిదండ్రులు అన్నారు. దీంతో దిగొచ్చిన యాజమాన్యం విద్యార్థిని లోపలకు అనుమతిచ్చింది.