సంగారెడ్డి జిల్లాలో దారుణం

ABN , First Publish Date - 2021-07-28T16:31:38+05:30 IST

జిల్లాలో దారుణం జరిగింది. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండ్రోజుల క్రితం మహిళ మిస్సింగ్ కేసును పోలీసులు నమోదు చేసుకుని దర్యాప్తు...

సంగారెడ్డి జిల్లాలో దారుణం

సంగారెడ్డి: జిల్లాలో దారుణం జరిగింది. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండ్రోజుల క్రితం మహిళ మిస్సింగ్ కేసును పోలీసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. కురవిస్వామి అనే వ్యక్తి సదరు మహిళను మంత్రికుటా అంకెరాళ్ల గుట్టల్లో కి తీసుకెళ్లి అత్యాచారం చేసి..హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‎కు తరలించారు.

Updated Date - 2021-07-28T16:31:38+05:30 IST