సంగారెడ్డిలో దారుణం..

ABN , First Publish Date - 2021-04-11T17:28:01+05:30 IST

జిల్లాలో దారుణం జరిగింది. అత్తా, భార్యపై అనుమానంతో ఇద్దరిని అల్లుడు కత్తితో పొడిచి కిరాతకంగా హత్య చేసాడు. ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా ....

సంగారెడ్డిలో దారుణం..

సంగారెడ్డి: జిల్లాలో దారుణం జరిగింది.  అత్తా, భార్యపై అనుమానంతో ఇద్దరిని అల్లుడు కత్తితో పొడిచి కిరాతకంగా హత్య చేసాడు. ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారిద్దరు అక్రమ సంబంధం పెట్టుకున్నారనే అనుమాన భూతం చిచ్చు హత్యకు దారి తీసింది. ఈ ఘటన బొల్లారం గాంధీనగర్‌లో చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు (నరసింహ) హత్య చేసిన తర్వాత స్టేషన్‎లో లొంగిపోయాడని చెప్పారు. భార్యపై అనుమానం రావడంతో ఇద్దరిని హత్య చేశాడని  పోలీసులు తెలిపారు. మృతులు స్వరూప, ఎల్లమ్మగా పోలీసులు గుర్తించారు.

Updated Date - 2021-04-11T17:28:01+05:30 IST