సంగారెడ్డిలో దారుణం..
ABN , First Publish Date - 2021-04-11T17:28:01+05:30 IST
జిల్లాలో దారుణం జరిగింది. అత్తా, భార్యపై అనుమానంతో ఇద్దరిని అల్లుడు కత్తితో పొడిచి కిరాతకంగా హత్య చేసాడు. ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా ....
సంగారెడ్డి: జిల్లాలో దారుణం జరిగింది. అత్తా, భార్యపై అనుమానంతో ఇద్దరిని అల్లుడు కత్తితో పొడిచి కిరాతకంగా హత్య చేసాడు. ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారిద్దరు అక్రమ సంబంధం పెట్టుకున్నారనే అనుమాన భూతం చిచ్చు హత్యకు దారి తీసింది. ఈ ఘటన బొల్లారం గాంధీనగర్లో చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు (నరసింహ) హత్య చేసిన తర్వాత స్టేషన్లో లొంగిపోయాడని చెప్పారు. భార్యపై అనుమానం రావడంతో ఇద్దరిని హత్య చేశాడని పోలీసులు తెలిపారు. మృతులు స్వరూప, ఎల్లమ్మగా పోలీసులు గుర్తించారు.