సంగం టెక్నీషియన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు

ABN , First Publish Date - 2021-05-09T08:37:26+05:30 IST

సంగం డెయిరీలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న మహేశ్‌ నివాసంపై ఏసీబీ బృందం శనివారం మధ్యాహ్నం దాడి చేసింది

సంగం టెక్నీషియన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు

మంగళగిరి, మే 8: సంగం డెయిరీలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న మహేశ్‌ నివాసంపై ఏసీబీ బృందం శనివారం మధ్యాహ్నం దాడి చేసింది. మంగళగిరి మండలం ఆత్మకూరు పంచాయతీ ఇప్పటం రోడ్డులో ఆయన నివసిస్తున్న ఆపార్టుమెంటులోని ఫ్లాట్‌ నం.205పై నలుగురు సిబ్బందితో కూడిన ఏసీబీ బృందం  సోదాలు నిర్వహించింది. అనంతరం సంగం డెయిరీకి సంబంధించిన డేటాను అనధికారికంగా తమ హార్డ్‌డి్‌స్కలలో కాపీ చేసి ఇవ్వాలని మహేశ్‌ను ఒత్తిడి చేసినట్టు సమాచారం.

Updated Date - 2021-05-09T08:37:26+05:30 IST