సంగంపై ప్రభుత్వానికి ఎందుకు కక్ష? ఉద్యోగుల ప్రశ్న

ABN , First Publish Date - 2021-05-07T00:09:36+05:30 IST

సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర అక్రమ అరెస్టును నిరసిస్తూ డెయిరీ ఉద్యోగులు గురువారం ధర్నా నిర్వహించారు

సంగంపై ప్రభుత్వానికి ఎందుకు కక్ష? ఉద్యోగుల ప్రశ్న

గుంటూరు : సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర అక్రమ అరెస్టును నిరసిస్తూ డెయిరీ ఉద్యోగులు గురువారం ధర్నా నిర్వహించారు. సంగం డెయిరీ వల్ల ఇంత మందికి ఉపాధి కల్పిస్తోన్న యాజమాన్యంపై ప్రభుత్వానికి ఎందుకింత కక్ష అని ప్రశ్నించారు. ఇష్టానుసారంగా డెయిరీలో సోదాలు నిర్వహిస్తున్నారని, డేటాను కూడా లాక్కుంటున్నారని మండిపడ్డారు. అసలు జగన్ సర్కార్‌కు అమూల్ మీద ఎందుకంత ప్రేమ పుట్టుకొచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. సంగం చైర్మన్ నరేంద్రపై కక్ష సాధింపు చర్యలను ప్రభుత్వం మానుకోవాలని, గంట గంటకూ ఆయన హెల్త్ బులిటెన్‌ను విడుదల చేయాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 


Updated Date - 2021-05-07T00:09:36+05:30 IST