’ప్రైవేట్ వ్యక్తులకు యాక్సిస్ ఇస్తారా?’ ‘సంగం’ వ్యవహారంలో కొత్త ట్విస్ట్

ABN , First Publish Date - 2021-05-06T21:57:31+05:30 IST

సంగం డైయిరీ వ్యవహారంపై కొత్త వివాదం నెలకొంది. తనిఖీల పేరుతో బయటి వ్యక్తులను తీసుకురావడంపై

’ప్రైవేట్ వ్యక్తులకు యాక్సిస్ ఇస్తారా?’ ‘సంగం’ వ్యవహారంలో కొత్త ట్విస్ట్

అమరావతి : సంగం డైయిరీ వ్యవహారంపై కొత్త వివాదం నెలకొంది. తనిఖీల పేరుతో బయటి వ్యక్తులను తీసుకురావడంపై యాజమాన్యం తీవ్ర అభ్యంతం వ్యక్తం చేస్తోంది. అంతేకాకుండా డైరీ కీలక డేటా ఉండే సర్వర్ల ఆపరేట్ విషయంలోనూ వివాదం నెలకొంది. మార్కెటింగ్ డేటా ఉండే సర్వర్ల విషయంలో బయటి వ్యక్తులకు యాక్సిస్ ఇవ్వడమేంటని సంగం డెయిరీ మండిపడుతోంది. తనిఖీలు చేసే విషయంలో హైకోర్టు పోలీసులకు మాత్రమే అనుమతునిచ్చిందని, అదే ప్రైవేట్ వ్యక్తులు చేస్తే డేటా చౌర్యం జరగొచ్చని సంగం ప్రతినిధులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలా చేయడం కోర్టు ధిక్కరణ కిందికే వస్తుందని, తనిఖీల్లో ప్రైవేట్ వ్యక్తుల ప్రమేయాన్ని తాము కోర్టు దృష్టికి తీసుకెళ్తామని సంగం ప్రతినిధులు స్పష్టం చేశారు. అయితే తనిఖీలు చేయడానికి అనుమతులు ఉన్నాయని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. 

Updated Date - 2021-05-06T21:57:31+05:30 IST