అమెరికాలో ఇసుక తుఫాను.. 20 వాహనాలు క్రాష్.. ఏడుగురు మృతి

ABN , First Publish Date - 2021-07-27T07:02:37+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో ఇసుక తుఫాను కలకలం రేపింది. దీని వల్ల రోడ్డుపై వెళ్తున్న కనీసం 20 వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి.

అమెరికాలో ఇసుక తుఫాను.. 20 వాహనాలు క్రాష్.. ఏడుగురు మృతి

ఉటా: అగ్రరాజ్యం అమెరికాలో ఇసుక తుఫాను కలకలం రేపింది. దీని వల్ల రోడ్డుపై వెళ్తున్న కనీసం 20 వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదం అమెరికాలోని ఉటా ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం జరిగింది. ఇక్కడ కరోష్‌కు సమీపంలోని ఇంటర్‌స్టేట్ 15పై ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో ప్రత్యక్షం అయ్యాయి. వరుసపెట్టి కార్లు, కంటైనర్లు వంటివి ఒకదానితో ఒకటి ఢీకొట్టుకొని కుప్పగా పడి ఉన్న ఈ ఫొటోలు ప్రమాద తీవ్రతకు అద్దం పడుతున్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన కొందరిని విమానాల్లో ఆస్పత్రికి తరలించారు.

Updated Date - 2021-07-27T07:02:37+05:30 IST