హైకోర్టుకు సంధ్య కన్వెన్షన్ ఎండీ

ABN , First Publish Date - 2021-11-19T00:20:53+05:30 IST

హైకోర్టును సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు

హైకోర్టుకు సంధ్య కన్వెన్షన్ ఎండీ

హైదరాబాద్: హైకోర్టును సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు ఆశ్రయించారు. శ్రీధర్ రావుకు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో దాఖలు పిటిషన్ అయింది. ఇప్పటికే రాయదుర్గం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో శ్రీధర్ రావు అరెస్ట్ అయ్యాడు. బెయిల్ మంజూరు చేయాలని శ్రీధర్ రావు తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. శ్రీధర్ రావుపై సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 6 కేసులు నమోదయ్యాయి. తమకు జరిగిన మోసంపై మూడు కమిషనరేట్ల పరిధిలో శ్రీధర్ రావుపై అనేక మంది బాధితులు ఫిర్యాదు చేశారు. బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. 





Updated Date - 2021-11-19T00:20:53+05:30 IST