అహ్మద్ పటేల్ను గుచ్చిగుచ్చి ప్రశ్నించిన ఈడీ అధికారులు
ABN , First Publish Date - 2020-07-03T05:28:45+05:30 IST
న్యూఢిల్లీ: సందేశరా స్కాంలో వరుసగా మూడోరోజు కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ అధికారులు విచారించారు. జూన్ 27, జూన్ 30న కూడా ఆయన్ను విచారించారు.
న్యూఢిల్లీ: సందేశరా స్కాంలో వరుసగా మూడోరోజు కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ అధికారులు విచారించారు. జూన్ 27, జూన్ 30న కూడా ఆయన్ను విచారించారు. సందేశరా సోదరులతో ఉన్న సంబంధాలపై అహ్మద్ పటేల్ను గుచ్చిగుచ్చి ప్రశ్నించారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు.
స్టెర్లింగ్ బయోటెక్ గ్రూప్నకు చెందిన సందేశరా సోదరులు పలు బ్యాంకులనుంచి వేలకోట్లు రాబట్టుకుని విదేశాలకు పరారయ్యారు. సందేశరా సోదరులను గతంలో సీబీఐ, ఇన్కం టాక్స్ అధికారులు కూడా ప్రశ్నించారు.