తక్కువ ధరకు ఇసుకను అందుబాటులోకి తేవాలి

ABN , First Publish Date - 2020-06-07T11:20:21+05:30 IST

ప్రభుత్వం తక్కువ ధరకే ఇసుకను అందుబాటులో ఉంచాలని, తద్వా రా భవన నిర్మాణ పనులు ఊపందుకుంటే కార్మికులకు ఉపాధి

తక్కువ ధరకు ఇసుకను అందుబాటులోకి తేవాలి

టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి వికాస్‌ హరిక్రిష్ణ


కడప (సెవెన్‌రోడ్స్‌), జూన్‌ 6 : ప్రభుత్వం తక్కువ ధరకే ఇసుకను అందుబాటులో ఉంచాలని, తద్వా రా భవన నిర్మాణ పనులు ఊపందుకుంటే కార్మికులకు ఉపాధి దొరుకుతుందని టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి వికాస్‌ హరిక్రిష్ణ తెలిపారు. ఐటీఐ సర్కిల్‌ వద్ద గల తన కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కరోనా సమయంలో దాచుకున్న డబ్బులు అయిపోయి పస్తులతో కాలం గడుపుతున్నారన్నారు.


కరోనా తరువాత భవన నిర్మాణ రంగం ఊపందుకోవడంతో కార్మికులు ఇప్పుడిప్పుడే పనులకు వెళ్ళడం ప్రారంభించారని, ప్రభుత్వం నిర్మాణ రంగానికి ఇసుక కొరత రాకుండా చేసి తక్కువ ధరకే అందించాలని తెలిపారు. ఆన్‌లైన్‌లో బల్క్‌ ఆర్డర్ల వలన నిమిషాలలో సైట్‌ క్లోజ్‌ అవుతుందని అలా కాకుండా సైట్‌ రోజుకు 12 గంటలు అందుబాటులో ఉండేటట్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. 

Updated Date - 2020-06-07T11:20:21+05:30 IST