అమ్మో.. ఇసుక కొనలేం..!
ABN , First Publish Date - 2021-08-04T04:53:32+05:30 IST
ఇసుక కార్మికుల ఆందోళనతో అమ్మకాలు నిలిచిపోయాయి.
తాళ్లపూడి, ఆగస్టు 3: ఇసుక కార్మికుల ఆందోళనతో అమ్మకాలు నిలిచిపోయాయి. గోదావరి వరదలతో ఇసుక ర్యాంపులు మూతపడ్డాయి. స్టాక్ పాయింట్ వద్ద అధిక ధరలకు కొనుగోలు చేయలేక, కిరాయి భరించలేక భవన యజమానులు నిర్మాణాలు నిలిపివేశారు. మండలంలో చిడిపి ఓపెన్రీచ్, అనంతరం ప్రక్కిలంక, తాడిపూడి ర్యాంపులలో విక్రయాలు ప్రారంభించారు. గోదావరి వరద పోటెత్తడంతో మూడు ర్యాంపులు ఏకకాలంలో మూతపడ్డాయి. ప్రస్తుతం సిమెంటు, ఐరన్ ధరలు పెరుగుదల లేకున్నా ఇసుక లభ్యత లేకపోవడంతో వ్యాపారాలన్నీ మందగించాయి.