ఇసుక పాలసీ ఘోరంగా విఫలమైంది: హర్షకుమార్
ABN , First Publish Date - 2021-06-11T12:22:39+05:30 IST
‘‘రాష్ట్రంలో..
రాజమహేంద్రవరం సిటీ: ‘‘రాష్ట్రంలో ఇసుక పాలసీ ఘోరంగా విఫలమయింది. సీఎం జగన్ ఇసుకను రెడ్ల చేతుల్లో పెట్టారు. విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కనుసన్నల్లో ఇసుక దోపిడీ జరుగుతుంది’’ అని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేలు కాంట్రాక్టర్లుగా మారి ఇసుక దోచుకున్నారన్నారు.