కంభాలదిన్నెలో ఇసుక మాఫియా

ABN , First Publish Date - 2022-05-22T05:55:30+05:30 IST

మండలంలోని కంభాలదిన్నె గ్రామంలో ఇసుక మాఫియా రాజ్యమేలుతోందని టీడీపీ మండల తెలుగు రైతు సంఘం అధ్యక్షుడు మన్నం రమణయ్య, టీడీపీ మండల ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు డోలా శేషాద్రి ఆరోపించారు.

కంభాలదిన్నెలో ఇసుక మాఫియా
మాట్లాడుతున్న టీడీపీ నాయకులు

చర్యలకు టీడీపీ డిమాండ్‌

పామూరు, మే 21 : మండలంలోని కంభాలదిన్నె గ్రామంలో ఇసుక మాఫియా రాజ్యమేలుతోందని టీడీపీ మండల తెలుగు రైతు సంఘం అధ్యక్షుడు మన్నం రమణయ్య, టీడీపీ మండల ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు డోలా శేషాద్రి ఆరోపించారు. స్థానిక కార్యాలయంలో శనివారం విలేక రుల సమావేవం నిర్వహించారు. గ్రామానికి చెందిన శ్మశానవాటిక, నీళ్ల ట్యాంక్‌ దగ్గర రాత్రి సమయాల్లో పెద్దపెద్ద గోతులు తీసి సమాదులను సైతం తొలగిస్తూ అక్రమంగా ఇసుకను ఇరలిస్తూ సంపదను దోచుకుం టున్నారన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలపై సంబంధిత అఽధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదన్నారు. అధికార పార్టీ నాయకుల అం డదండలతో  జోరుగా ఇసుకను  తరలించుకుపోతున్నారన్నారు. ఇప్పటి కైనా అధికారులు స్పందించి  ఇసుక అక్రమ రవాణను అరికట్టాలని వారు డిమాండ్‌ చేశారు. సమావేశంలో టీడీపీ ఒంగోలు పార్లమెంట్‌ ముస్లిం మైనార్టీ సెల్‌ అధికార ప్రతినిధి  ఆర్‌ఆర్‌ రఫీ, ఎమ్మార్పీఎస్‌  మండల కమిటీ మాజీ అధ్యక్షుడు శేషంమోషే పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-22T05:55:30+05:30 IST