ఇసుక అక్రమాలను అడ్దుకోవాలి
ABN , First Publish Date - 2020-05-28T11:28:57+05:30 IST
ఇసుక అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలని ఎస్ఈబీ అడిషినల్ ఎస్పీ గౌతమిసాలి అన్నారు. ఎస్పీ ఫక్కీరప్ప ఆదేశాల
- ఎస్ఈబీ అడిషినల్ ఎస్పీ గౌతమి శాలి
కర్నూలు, మే 27: ఇసుక అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలని ఎస్ఈబీ అడిషినల్ ఎస్పీ గౌతమిసాలి అన్నారు. ఎస్పీ ఫక్కీరప్ప ఆదేశాల మేరకు డీపీవోలోని వ్యాస్ ఆడిటోరియంలో జిల్లా డిప్యూటీ డైరెక్టర్, మెన్స్ అండ్ జియోలాజీ, డిస్ట్రిక్ట్ శాండ్ ఆఫీసర్ (ఎఫ్ఏసీ) టి.రాజశేఖర్, జిల్లా పంచాయతీ అధికారి కేఎల్ ప్రభాకర్రావుతో ఆమె బుధవారం సమావేశం నిర్వహించారు. నోటిఫై చేసిన గ్రామాల్లోనే ఇసుకను తీసుకోవాలని వారికి సూచించారు. 30 కి.మీ. వరకు స్థానిక అవసరాలకు ఇసుకను తీసుకోవచ్చని అన్నారు. ఇసుక బల్క్ బుకింగ్లో అక్రమాలు జరగకుండా చూడాలని సూచించారు. సమావేశంలో మెన్స్ అండ్ జియోలాజీ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీరామ్ శివారెడ్డి, వేణుగోపాల్, శాండ్ నోడల్ ఆఫీసర్ జె.గంగాధర్, ఎస్ఈబీ సీఐ శ్రీరామ్ కిషోర్, ఎస్ఈబీ ఎస్ఐలు శ్రీనివాసులు, కీర్తి పాల్గొన్నారు.