ప.గో. జిల్లాలో ఇసుక అక్రమతవ్వకాలు
ABN , First Publish Date - 2021-04-11T16:02:26+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లా, పెదవేగి మండలం, నడిపల్లి తమ్మిలేరులో ఇసుక అక్రమతవ్వకాలు చేస్తుండడంతో...
ప.గో.జిల్లా: రాష్ట్రంలోని ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు అధికారులు రీచ్లు, చెక్పోస్టుల వద్ద నిరంతర నిఘా పెట్టినప్పటికీ ఇసుక అక్రమ తవ్వకాలు పెరిగిపోతున్నాయి. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా, పెదవేగి మండలం, నడిపల్లి తమ్మిలేరులో ఇసుక అక్రమతవ్వకాలు చేస్తుండడంతో స్థానికులు అడ్డుకున్నారు. 12ట్రాక్టర్లను నిలిపివేసి.. పోలీసులు, రెవెన్యూ అధికారుకు సమాచారం ఇచ్చారు.