Samsung Galaxy S22 ఫోన్ల ప్రీ-బుకింగ్స్ ప్రారంభం.. భారీ డిస్కౌంట్
ABN , First Publish Date - 2022-02-23T00:48:38+05:30 IST
Samsung Galaxy S22 ఫోన్ల ప్రీ-బుకింగ్స్ ప్రారంభం.. భారీ డిస్కౌంట్
న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లతో కొత్త స్మార్ట్ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ స్మార్ట్ఫోన్లను ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్22, గెలాక్సీ ఎస్22 అల్ట్రా ఫోన్లను ప్రీ-బుకింగ్ చేసుకున్న వినియోగదారులు రూ. 8000 వరకు బోనస్ పొందవచ్చు. ఈ ఆఫర్ ఈ రోజు అర్థరాత్రి వరకు మాత్రమే ఉంటుందని కంపెనీ పేర్కొంది. భారత మార్కెట్లో రోజువారీ స్మార్ట్ఫోన్ల ప్రీ-బుకింగ్ బుధవారం నుంచి ప్రారంభమవుతోందని సంస్థ తెలిపింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్22 ఫోన్లను ప్రీ-బుకింగ్ చేసుకున్న కస్టమర్లు రెండు గెలాక్సీ బడ్స్ ఉచితంగా పొందుతారని కంపెనీ తెలిపింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్22 ఫోన్ రూ. 72,999, శాంసంగ్ గెలాక్సీ ఎస్22 ప్లస్ ఫోన్ రూ. 84,999, శాంసంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రా ఫోన్ ప్రారంభ ధర రూ. 1,09,999 ఉంటుందని సంస్థ పేర్కొంది.