Samsung Galaxy A52s 5G స్మార్ట్ఫోన్ విడుదల
ABN , First Publish Date - 2021-09-01T23:10:42+05:30 IST
Samsung Galaxy A52s 5G స్మార్ట్ఫోన్ విడుదల
న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. అద్భుత ఫీచర్లతో కొత్త మోడల్లో స్మార్ట్ఫోన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్ 5జీ స్మార్ట్ఫోన్ను విడుదల చేసినట్లు సంస్థ ప్రకటించింది. శాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్ 5జీ స్మార్ట్ఫోన్ ప్రారంభ ధర రూ. 35,999 ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్ 5జీ స్మార్ట్ఫోన్ భారతదేశంలో రెండు వేరియంట్లలో అమ్మకానికి వస్తోంది. గత నెలలో మొదటిసారిగా యూకేలో శాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్ 5జీ స్మార్ట్ఫోన్ను విడుదల చేశారు. శాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్ 5జీ ఫోన్ 8జీబీ ర్యామ్తో వస్తోంది.