Samsung: కొత్త గెలాక్సీ ఏ12ఎస్ స్మార్ట్ఫోన్..
ABN , First Publish Date - 2021-07-18T01:02:32+05:30 IST
Samsung: కొత్త గెలాక్సీ ఏ12ఎస్ స్మార్ట్ఫోన్..
న్యూఢిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ తమ కస్టమర్లకు శుభవార్త అందించింది. వచ్చే నెలలో భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ ఏ12ఎస్ స్మార్ట్ఫోన్ను విడుదల చేయనున్నట్లు సంస్థ పేర్కొంది. అయితే ఫోన్లకు సంబంధించి ధరలు లీకయ్యాయి. 6జీబీ ర్యామ్తోపాటు 128జీబీ స్టోరేజ్ వేరియంట్ శాంసంగ్ గెలాక్సీ ఏ22 5జీ స్మార్ట్ఫోన్ రూ. 19,999 ఉంటుందని అంచనా వేస్తున్నారు.