కొత్త ఫీచర్లతో Samsung Galaxy A21 స్మార్ట్ఫోన్..
ABN , First Publish Date - 2021-08-29T07:35:50+05:30 IST
కొత్త ఫీచర్లతో Samsung Galaxy A21 స్మార్ట్ఫోన్..
న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. అద్భుత ఫీచర్లతో శాంసంగ్ స్మార్ట్ఫోన్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. కొత్త మోడల్లో శాంసంగ్ గెలాక్సీ ఏ21 సింపుల్ స్మార్ట్ఫోన్లను విడుదల చేసినట్లు సంస్థ పేర్కొంది. శాంసంగ్ గెలాక్సీ ఏ21 సింపుల్ జపాన్కు ప్రత్యేకంగా ఉంటుంది. ఈ ఫోన్కు 3,600ఎంఏహెచ్ బ్యాటరీ సపోర్టు ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఏA21 సింపుల్ 5.8-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఏ21 సింపుల్ స్మార్ట్ఫోన్ సుమారు రూ. 14,700 ఉంటుంది. సెప్టెంబర్ 9 నుంచి జపాన్ మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ ఏ21 సింపుల్ స్మార్ట్ఫోన్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.