మాదే సంతోషకర జట్టు

ABN , First Publish Date - 2020-02-20T09:55:37+05:30 IST

తాజా టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ గట్టి పోటీదారే కాదు.. అత్యంత సంతోషకర జట్టుకూడానంటోంది స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన. యువ క్రికెటర్లతో నిండిన భారత

మాదే సంతోషకర జట్టు

స్మృతి మంధాన

సిడ్నీ: తాజా టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ గట్టి పోటీదారే కాదు.. అత్యంత సంతోషకర జట్టుకూడానంటోంది స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన. యువ క్రికెటర్లతో నిండిన భారత మహిళల జట్టు సగటు వయస్సు 23లోపే ఉండడం విశేషం. అందుకే ఉత్సాహంగా.. ఉల్లాసంగా ఉంటామని చెబుతోంది. ఈ విషయంలో తమకు ఒక్క థాయ్‌లాండ్‌ కాస్త పోటీ ఇవ్వచ్చని సరదాగా తెలిపింది. ‘సరదాగా ఎలా ఉండాలో మా బృందానికి తెలుసు. మేం నృత్యాలతో పాటు పాటలు కూడా పాడతాం. ఈ టోర్నీలో మాదే అత్యంత సంతోషకర జట్టని నా అభిప్రాయం. ఎందుకంటే మా వయస్సులో సరదాలే కదా ఉండేది. ఒకవేళ అలా లేకుంటే మాలో ఏదో సమస్య ఉన్నట్టే. గత ఏడాదిన్నరగా మా జట్టు ఇలాగే ఉంది. ఇంతకుముందేమో కానీ ఇప్పుడు టీనేజర్లు జట్టులోకి వచ్చాక మాలో కూడా సరికొత్త ఉత్సాహం వచ్చేసింది. ఇక జెమీమా రోడ్రిగ్స్‌ సందడి చాలా ఎక్కువగా ఉంటుంది. తను మంచి గిటారిస్టు కూడా’ అని 23 ఏళ్ల స్మృతి పేర్కొంది.

Updated Date - 2020-02-20T09:55:37+05:30 IST