ఎమ్మెల్సీగా చిన్నారెడ్డే సమర్థుడు
ABN , First Publish Date - 2021-03-09T20:26:08+05:30 IST
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ
జోగులాంబ గద్వాల జిల్లా: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులలో అందరి కంటే కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డే సమర్థుడైన నాయకుడని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అన్నారు. గద్వాల పట్టణంలోని టీఎన్జీవో భవన్లో సంపత్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. రాష్ట్రంలోని నిరుద్యోగుల కడుపు మంటకు టీఆర్ఎస్, బీజేపీలే కారణమని ఆయన ఆరోపించారు. గతంలో ఎమ్మెల్సీలుగా పనిచేసిన నాయకులు ఏనాడు ఉద్యోగ, నిరుద్యోగుల సమస్యలపై మాట్లాడింది లేదని ఆయన విమర్శించారు. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందని సంపత్ కుమార్ తెలిపారు.