రాష్ట్రంలో గూండాల రాజ్యం నడుస్తోంది: ఏలూరి సాంబశివరావు

ABN , First Publish Date - 2021-04-13T19:33:43+05:30 IST

చంద్రబాబుకు వస్తున్న ప్రజాదరణతో వైసీపీకి కళ్లు బైర్లు కమ్మాయని టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు.

రాష్ట్రంలో గూండాల రాజ్యం నడుస్తోంది: ఏలూరి సాంబశివరావు

అమరావతి: చంద్రబాబుకు వస్తున్న ప్రజాదరణతో వైసీపీకి కళ్లు బైర్లు కమ్మాయని టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో గూండాల రాజ్యం నడుస్తోందని, చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడే అందుకు సాక్ష్యమని అన్నారు. బాంబులను తట్టుకుని ప్రజల ఆశీర్వాదంతో నిలిచిన గుండె చంద్రబాబుదని అన్నారు. వైసీపీ పిరికిపంద చర్యలకు ఎవరూ భయపడరని అన్నారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదని, శాంతి భద్రతలు ముఖ్యమన్నారు. వైసీపీవి చౌకబారు పనులని, వాళ్లేసిన రాళ్లు.. వైసీపీ పతనానికి పునాదని ఏలూరి సాంబశివరావు వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-04-13T19:33:43+05:30 IST