సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యం
ABN , First Publish Date - 2022-08-07T06:37:52+05:30 IST
సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యం
పామర్రు, ఆగస్టు 6 : దళిత కాలనీల్లో సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని టీడీపీ పామర్రు నియోజకవర్గ ఇన్చార్జి వర్ల కుమార్రాజా అన్నారు. అంకమ్మగుంట దళితవాడలో శనివారం బాదుడే- బాదుడులో పాల్గొన్నారు. రెండు నెలల నుంచి కుళాయిల ద్వారా నీరు అందక తీవ్ర ఇబ్బంది పడుతున్నామన్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను తెలియజేస్తూ ఇంటింటా కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు చాట్ల రమేష్, నూకవరపు వీరాంజనేయులు, ఈడే నాని, చింతయ్య, మనోజ్, కేదారాశిపల్లి శ్రీను, దుర్గా, రాజా పాల్గొన్నారు.
పెదపారుపూడి : సమాజం సిగ్గుపడేలా వైసీపీ ప్రజా ప్రతినిధులకు వికృత చేష్టలున్నాయని వర్ల కుమార్ రాజా అన్నారు. వెంట్రప్రగడ శివారు లక్ష్మీపురం, శివపురంలో బాదుడే బాదుడు నిర్వహించారు. చలసాని రమేష్ చౌదరి, లీగల్ అడ్వయిజర్ గొరిపర్తి రవికుమార్ తదితరుల పాల్గొన్నారు.