కావలి రూరల్‌లో శ్యామ్‌ ప్రసాద్‌ వర్ధంతి

ABN , First Publish Date - 2021-06-24T03:31:13+05:30 IST

జనసంఘ్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ వర్ధంతిని బుధవారం కావలి రూరల్‌ మండలం పెదపట్టపుపాలెంలో ఘనం

కావలి రూరల్‌లో శ్యామ్‌ ప్రసాద్‌ వర్ధంతి
శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న బీజేపీ నేతలు

  కావలి రూరల్‌లో శ్యామ్‌ ప్రసాద్‌ వర్ధంతి

కావలి రూరల్‌, జూన్‌23: జనసంఘ్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ వర్ధంతిని బుధవారం కావలి రూరల్‌ మండలం పెదపట్టపుపాలెంలో ఘనంగా జరిగింది. రూరల్‌ మండల బీజేపీ అధ్యక్షుడు మామిడి వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.   కార్యక్రమంలో బీజేపీ నాయకులు క్రాంతి కుమార్‌, కామాక్షమ్మ, బాలమురళి, యల్లంగారి ప్రసాద్‌, ప్రళయకావేరి ప్రభాకర్‌, బండ్ల వేణు తదితరులు పాల్గొన్నారు.


బిట్రగుంటలో...


బిట్రగుంట, జూన్‌ 23:  భారతీయ జనసంఘ్‌ పార్టీని డాక్టర్‌ శ్యామ్‌ ప్రసాధ్‌ ముఖర్జీ స్థాపించారని మండల బీజేపీ అధ్యక్షుడు పసుపులేటి వెంకటేశ్వర్లు అన్నారు. బోగోలు మండలం చెంచులక్ష్మీపురంలోని నూతన పార్టీ కార్యాలయంలో బుధవారం ముఖర్జీ వర్థంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో  పార్టీ నాయకులు గుర్రంవెంకటేశ్వర్లు, నూకసాని శ్రీనివాసులు, అలెగ్జాండర్‌ అంతోని, వైవీపి రెడ్డి, రవి, ప్రభాకర్‌, రమేష్‌, సూరి తదితరులు  పాల్గొన్నారు.


Updated Date - 2021-06-24T03:31:13+05:30 IST