సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది:అఖిలేష్
ABN , First Publish Date - 2021-11-13T00:58:53+05:30 IST
సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది:అఖిలేష్
జైపూర్: వచ్చే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ విజయం సాధిస్తుందని యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అన్నారు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వంపై అఖిలేష్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వల్ల దేశ ప్రజలు పెద్ద సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. అయితే బీజీపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ అరుణ్ సింగ్ మాట్లాడుతూ అఖిలేష్ యాదవ్ వాదనను బూటకమని అభివర్ణించారు. యూపీలో ప్రభుత్వాన్ని ఎస్పీ ఏర్పాటు చేసే ప్రశ్నే లేదని అరుణ్ సింగ్ చెప్పారు. అఖిలేష్ యాదవ్ శుక్రవారం ఒక వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు జైపూర్ విమానాశ్రయానికి చేరుకున్నారు.