అధికారంలోకి వస్తే 3 నెలల్లో కుల గణన: అఖిలేష్ యాదవ్

ABN , First Publish Date - 2021-12-22T01:26:42+05:30 IST

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అధికారంలోకి వస్తే మూడు నెలల్లో కుల గణన చేపడ్తామని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ చెప్పారు.

అధికారంలోకి వస్తే 3 నెలల్లో కుల గణన: అఖిలేష్ యాదవ్

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అధికారంలోకి వస్తే మూడు నెలల్లో కుల గణన చేపడ్తామని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ చెప్పారు. జనాభా ప్రాతిపదికన సమాజంలో ప్రతి ఒక్కరికీ హక్కులతో పాటు గౌరవం కల్పిస్తామన్నారు. పార్టీ విజయ్ రథయాత్రలో భాగంగా మెయిన్‌పురిలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. నగరాలకు పేర్లు మార్చడం, పాత పథకాలనే తిరిగి ప్రారంభించడం తప్ప వేరేమీ చేయడంలేదంటూ ఆయన సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై విమర్శలు గుప్పించారు. మరోవైపు కులాల వారీగా జనాభాను లెక్కించాలంటూ బీహార్ సీఎం నితీశ్‌కుమార్ ఆధ్వర్యంలో ఇటీవలే ఓ బృందం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసింది.   

Updated Date - 2021-12-22T01:26:42+05:30 IST