ములాయం ఆశీస్సులు తీసుకున్న స్మృతీ ఇరానీ

ABN , First Publish Date - 2022-02-01T00:47:42+05:30 IST

న్యూఢిల్లీ: బడ్జెట్ సమావేశాల వేళ పార్లమెంట్ ఆవరణలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.

ములాయం ఆశీస్సులు తీసుకున్న స్మృతీ ఇరానీ

న్యూఢిల్లీ: బడ్జెట్ సమావేశాల వేళ పార్లమెంట్ ఆవరణలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్‌ పార్లమెంట్ హాల్ మెట్లు దిగి బయటకు వస్తుండగా అక్కడే ఉన్న కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ఆయన పాదాలకు నమస్కరించారు. ములాయం ఆమెను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఇద్దరూ కుశల ప్రశ్నలు వేసుకున్నారు. యూపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ జరిగిన ఈ ఘటన నెటిజన్లను ఆకర్షించింది. వీడియో వైరల్ అయింది. 





Updated Date - 2022-02-01T00:47:42+05:30 IST