స్పందన అర్జీలు సత్వరమే పరిష్కరించండి: సబ్‌కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-07-27T05:56:18+05:30 IST

స్పందన కార్యక్రమానికి వచ్చే అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కందుకూరు సబ్‌ కలెక్టరు అపరాజిత సింగ్‌ ఆదేశించారు.

స్పందన అర్జీలు సత్వరమే పరిష్కరించండి: సబ్‌కలెక్టర్‌
అర్జీదారుల సమస్యలు ఆలకిస్తున్న సబ్‌కలెక్టర్‌

స్పందన అర్జీలు సత్వరమే పరిష్కరించండి: సబ్‌కలెక్టర్‌

కందుకూరు, జూలై 26: స్పందన కార్యక్రమానికి వచ్చే అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కందుకూరు సబ్‌ కలెక్టరు అపరాజిత సింగ్‌ ఆదేశించారు. సోమవారం ప్రారంభించిన స్పందన కార్యక్రమంలో డివిజన్‌లోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యలపై సబ్‌ కలెక్టరుకు అర్జీలు అందజేశారు. ఈ సందర్భంగా అర్జీదారుల సమస్యలను ఆమె సావధానంగా ఆలకించి సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. అనంతరం అర్జీదారులతో  వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నేరుగా మండల స్థాయి అధికారులతో మాట్లాడారు. తీసుకోవాల్సిన చర్యలపై సబ్‌కలెక్టరు నిర్థేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో అర్జీదారుల సంఖ్య తగ్గేలా చూడాలని, ఒకే సమస్యపై ప్రజలు పదేపదే కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం రాకుండా చూడాలని ఆదేశించారు. 

భూ సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టండి

కందుకూరు : రెవెన్యూలో ప్రధానంగా భూసమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి కోరారు. సోమవారం స్పందన కార్యక్రమంలో భాగంగా తహసీల్దార్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలపై అర్జీలు అందజేశారు. సమస్యలలో అధికశాతం భూ సంబంధిత సమస్యలే ఉంటున్నందున పరిష్కారానికి తగినచర్యలు తీసుకోవాలని సూచించారు.


Updated Date - 2021-07-27T05:56:18+05:30 IST