ఈ రహదారికి మోక్షమెప్పుడో..!

ABN , First Publish Date - 2022-07-02T04:59:08+05:30 IST

మండల కేంద్రానికి సమీపంలోని కమ్మవారిపల్లి రహదారికి మోక్షమెప్పుడో అని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ రహదారికి మోక్షమెప్పుడో..!
అర్థాంతరం నిలిపి వేసిన రోడ్డు ఇదే

నల్లచెరువు, జూలై 1 : మండల కేంద్రానికి సమీపంలోని కమ్మవారిపల్లి రహదారికి మోక్షమెప్పుడో అని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కమ్మవారిపల్లి, యనుములవారిపల్లి, పట్రవాండ్లపల్లి వరకు రూ.80 లక్షలతో ఒకటిన్నర సంవత్సరం క్రితం తార్‌ రోడ్డు మంజూరైంది. ఈ రోడ్డు పనులు చేయడానికి మట్టి రోడ్డు పూర్తి చేశారు. అక్కడక్కడ కంకర వేసి, నిలిపివేశారు. దీంతో ద్విచక్రవాహనాలు వెళ్లడానికి సైతం ఇబ్బందులు పడుతున్నారు. వర్షం వస్తే మట్టిరోడ్డు కావడంతో గుంతలు ఏర్పడడంతో గ్రామాలకు రాకపోకలు ఆగిపోతాయి. దీంతో ఈ రోడ్డులో వెళ్లే నాలుగు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గత వారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రామీణ ప్రాంత రహదారులు పూర్తి చేస్తామని ప్రకటన ఇవ్వడంతో ఈ రోడ్డు పూర్తి అవుతుందని గ్రామస్థులు ఎంతో ఆశగా ఎదురు చూశారు. అయితే ఇప్పటివరకు పనులు ప్రారం భించకపోవడంతో వారి ఆశలు నిరాశల య్యాయి.  సంబంధితాధికారులు తక్షణ చర్యలు చేపట్టి తార్‌ రోడ్డు పనులు ప్రారంభిం చాలని గ్రామస్థులు కోరుతున్నారు. 


Updated Date - 2022-07-02T04:59:08+05:30 IST