27నుంచి పంచగవ్య ఉత్పత్తుల విక్రయాలు
ABN , First Publish Date - 2022-01-25T06:35:34+05:30 IST
కోయంబత్తూరుకు చెందిన ఆశీర్వాద్ ఆయుర్వేద సంస్థ సహకారంతో టీటీడీ తయారు చేయిస్తున్న 15 రకాల పంచగవ్య గృహ ఉత్పత్తులను ఈనెల 27వ తేదీనుంచి విక్రయించనున్నట్లు జేఈవో వీరబ్రహ్మం వెల్లడించారు.
టీటీడీ జేఈవో వీరబ్రహ్మం వెల్లడి
తిరుపతి, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): కోయంబత్తూరుకు చెందిన ఆశీర్వాద్ ఆయుర్వేద సంస్థ సహకారంతో టీటీడీ తయారు చేయిస్తున్న 15 రకాల పంచగవ్య గృహ ఉత్పత్తులను ఈనెల 27వ తేదీనుంచి విక్రయించనున్నట్లు జేఈవో వీరబ్రహ్మం వెల్లడించారు. తిరుపతిలోని డీపీడబ్ల్యూ స్టోర్లోని తయారీ ప్లాంట్ను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో తయారు చేసిన చిత్రపటాలు, ఇతర ఉత్పత్తులను కూడా అదే రోజున ప్రారంభిస్తామని చెప్పారు. టీటీడీ ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అందించడానికి అనేక వైద్యశాలలు ముందుకొచ్చాయని, వాటితో ఎంవోయూ కుదుర్చుకుంటున్నామని పేర్కొన్నారు. సీఈ నాగేశ్వరరావు, గోశాల డైరెక్టర్ హరినాథరెడ్డి, వీజీవో మనోహర్, డాక్టర్ సునీల్కుమార్ తదితరులు ఆయనవెంట ఉన్నారు.