పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'సలార్' చిత్రానికి సంబంధించి ఓ లేటెస్ట్ న్యూస్ వచ్చి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ సినిమాను తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించి హిందీ, తమిళం, మలయాళ భాషల్లోకి డబ్ చేయనున్నారు. అయితే, తాజాగా 'సలార్' సినిమాకు సంబంధించిన ఓ న్యుస్ డార్లింగ్ అభిమానులను థ్రిల్ చేస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతోందని ఎక్కడా వార్తలు రాలేదు. కానీ, తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం 'సలార్'ను మేకర్స్ రెండు భాగాలుగా నిర్మించనున్నారట. త్వరలో దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానుందని సమాచారం. ఇదే నిజమైతే బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ చేసే సీక్వెల్ మూవీ ఇదే అవుతుంది.