వైద్యుల సేవకు సలాం
ABN , First Publish Date - 2020-08-05T09:30:29+05:30 IST
వైద్యుల సేవకు, సహకారానికి సలాం అని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ అన్నారు. మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఐఎంఏ
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్
వికారాబాద్: వైద్యుల సేవకు, సహకారానికి సలాం అని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ అన్నారు. మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఐఎంఏ తరపున పలువురు డాక్టర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తున్న తరుణంలో వైరస్ నియంత్రణకై రాత్రింభవళ్లు శ్రమిస్తున్న వైద్యులు, నర్సులు, శానిటేషన్ సిబ్బంది, పోలీసుల సేవలు అభినందనీయమన్నారు.
ఐఎంఏ తరపున నియోజకవర్గానికి చెందిన డాక్టర్లు పవన్కుమార్, రాజశేఖర్, గిరీశ, ఉజ్వల్ తదితరులు స్వచ్ఛందంగా ముందుకు రావడం శుభపరిణామం అని అన్నారు. అనంతరం రక్షాబంధన్ సందర్భంగా పలు వార్డుల కౌన్సిలర్లు ఎమ్మెల్యేకు రాఖీ కట్టారు. కాగా, మునిసిపల్ పరిధిలోని 11వ వార్డు కౌన్సిలర్ అనిత, ఇతర ముఖ్య కాంగ్రెస్ నాయకులు పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే ఆధ ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆమెతో పాటు మాజీ సర్పంచులు మొగులయ్య, పాండునాయక్, నాయకులు తదితరులు గిరిగేట్పల్లి, జాంబపూర్తండా, కొట్టంగట్టుతండాల నుంచి భారీ సంఖ్యలో టీఆర్ఎ్సలో చేరారు.
పల్లాని కలిసిన ఎమ్మెల్యే
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డిని మంగళవారం వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన వెంట వికారాబాద్ పీఏసీఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి, రమేష్, ప్రభాకర్రెడ్డి, రామస్వామి, మంజుల, సురేష్, కృష్ణారెడ్డి, నవీన్, పావని, రాములు ఉన్నారు.