సాక్షి యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు
ABN , First Publish Date - 2021-04-17T05:54:35+05:30 IST
సాక్షి దినపత్రిక అంబేడ్కర్ చిత్రపటాన్ని అవమానిస్తూ ప్రచురించడంపై సాక్షి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని తాళ్లరేవు మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మోకా విష్ణుప్రసాద్ ఆధ్వర్యంలో పలువురు దళితనాయకులు శుక్రవారం కోరింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తాళ్లరేవు, ఏప్రిల్ 16: సాక్షి దినపత్రిక అంబేడ్కర్ చిత్రపటాన్ని అవమానిస్తూ ప్రచురించడంపై సాక్షి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని తాళ్లరేవు మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మోకా విష్ణుప్రసాద్ ఆధ్వర్యంలో పలువురు దళితనాయకులు శుక్రవారం కోరింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంబే డ్కర్ను కార్టున్గా చిత్రీకరించడం యావత్ దళితుల మనోభావాలను అవమానించే విధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షి యాజమాన్యం తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.