ఆ బిల్లులు రైతు వ్యతిరేకం: సాకే, తులసిరెడ్డి
ABN , First Publish Date - 2020-09-19T09:09:03+05:30 IST
ఆ బిల్లులు రైతు వ్యతిరేకం: సాకే, తులసిరెడ్డి
అమరావతి, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఏపీసీసీ మండిపడింది. కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయానుబంధ బిల్లులు రైతు వ్యతిరేకమని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ విమర్శించారు. పాలన చేతగాక కోర్టులపై అభాండాలు వేయడం ఏమిటని సీఎం జగన్ని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎన్.తులసిరెడ్డి శుక్రవారం వేర్వేరుప్రకటనల్లో నిలదీశారు.