ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు ట్వీట్ చేసిన లేడీ టీచర్.. వెంటనే ఆయన ఏం చేశారంటే..
ABN , First Publish Date - 2021-11-16T15:10:30+05:30 IST
విద్యార్థుల..
కోటపల్లి: విద్యార్థుల అవస్థలు తప్పించాలంటూ ఓ ఉపాధ్యాయురాలు చేసిన ట్వీట్తో వారితో బస్సు సౌకర్యం సమకూరింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు నుంచి కోటపల్లి మోడల్ స్కూల్కు 200 మంది విద్యార్థులు వస్తారు. ఉదయం స్కూల్కు రావడానికి బస్సులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఒకే బస్సులో వందలాది మంది విద్యార్థులు ప్రయాణించాల్సి వస్తోంది. వారి ఇబ్బందులను వీడియో తీసిన ఉపాధ్యాయురాలు భారతి ఆర్టీసీ ఎండీకి ఈనెల 9న ట్వీట్ చేశారు. వెంటనే స్పందించిన సజ్జనార్ విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. ఆర్టీసీ అధికారులు విద్యార్థులకు అనుకూలంగా ఉండేలా సోమవారం నుంచి అదనపు బస్సును ఏర్పాటు చేశారు.