TSRTC MD Sajjanar మరో కీలక నిర్ణయం.. ఇకపై ఇలా చేస్తే గిఫ్ట్లు..
ABN , First Publish Date - 2021-11-12T17:22:52+05:30 IST
Sajjanar మరో కీలక నిర్ణయం.. ఇకపై ఇలా చేస్తే గిఫ్ట్లు..
హైదరాబాద్ సిటీ/రాజేంద్రనగర్ : వివాహ శుభకార్యాలకు ఆర్టీసీ బస్సు బుక్ చేసుకున్న పెళ్లి జంటకు కానుకలు ఇచ్చే కార్యక్రమానికి ఎండీ వీసీ సజ్జనార్ శ్రీకారం చుట్టారు. గురువారం యాదగిరిగుట్ట డిపో నుంచి రెండు బస్సులను అద్దెకు తీసుకుని కొంపల్లి వేదికగా పెళ్లి చేసుకున్న వరుడు ఆకుల భరత్కుమార్, వధువు సౌమ్యలకు డ్రైవర్లు ముత్యాల అంజనేయులు, పబ్బాటి గణేష్ జ్ఞాపికను బహూకరించి ఆశీర్వదించారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్వయంగా హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
డ్రైవర్లను అభినందించి ఫోటో దిగి ప్రోత్సహించారు. రాజేంద్రనగర్ బస్సు డిపో నుంచి గురువారం 15 బస్సులను వివాహ శుభకార్యాలకు అద్దెకు ఇచ్చామని డిపో మేనేజర్ పి.చంద్రకాంత్ తెలిపారు. బస్సు బుక్ చేసుకున్న మల్లాపూర్ గ్రామానికి చెందిన వరుడు సాయికుమార్, వధువు సుమాంజలికి డిపో తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ డ్రైవర్ యాదవ్ చేతుల మీదుగా కానుక అందజేశామని చెప్పారు. ప్రజలు తక్కువ ధరకు, ఎలాంటి డిపాజిట్ లేకుండా ఆర్టీసీ బస్సులను బుక్ చేసుకోవచ్చని సూచించారు.