మండలిలో సంపూర్ణ మెజార్టీ రాబోతోంది: సజ్జల

ABN , First Publish Date - 2021-03-04T20:15:20+05:30 IST

వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్టారెడ్డి తెలిపారు.

మండలిలో సంపూర్ణ మెజార్టీ రాబోతోంది: సజ్జల

అమరావతి:  వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ పదవుల ఎంపికలో.. అభ్యర్థుల నిర్ణయంలో పారదర్శకత.. సామాజిక తూకం పాటిస్తున్నారన్నారు.  వైసీపీలో కష్టపడిన వారికి పదవులు వస్తాయనే నమ్మకం  కార్యకర్తలకు ఉందన్నారు. కౌన్సిల్లోని మందబలాన్ని ఆసరా చేసుకుని ఇన్నాళ్లూ టీడీపీ ఏదో చేద్దామనుకుందని చెప్పారు. మార్చి నెలాఖరుతో మండలిలో సంపూర్ణ మెజార్టీ రాబోతోందన్నారు. ఇకపై  వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమం-అభివృద్ధి సమపాళ్లతో కూడిన పాలన దిగ్విజయంగా సాగనుందని రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2021-03-04T20:15:20+05:30 IST