డ్రగ్స్ ఇష్యూను ఏపీకి అంటగట్టాలని చూస్తున్నారు: సజ్జల

ABN , First Publish Date - 2021-10-05T23:40:01+05:30 IST

చంద్రబాబు పైత్యం పరాకాష్టకు చేరిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఎక్కడ ఏం జరిగినా ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తున్నారని మండిపడ్డారు.

డ్రగ్స్ ఇష్యూను ఏపీకి అంటగట్టాలని చూస్తున్నారు: సజ్జల

అమరావతి: చంద్రబాబు పైత్యం పరాకాష్టకు చేరిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఎక్కడ ఏం జరిగినా ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తున్నారని మండిపడ్డారు. డ్రగ్స్ ఇష్యూను ఏపీకి అంటగట్టాలని చూస్తున్నారని చెప్పారు. వైసీపీ నేతలకు ఎలా లింక్ పెట్టాలని స్కెచ్ వేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. టీడీపీ వారు డ్రగ్స్ బిజినెస్‌లోకి దిగారేమో అని అనుమానం వస్తోందన్నారు. హెరాయిన్ కేసును కేంద్ర నిఘా సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయని చెప్పారు. డ్రగ్స్ కేసులో ఎవరున్నారో దర్యాప్తులో తేలుతుందని పేర్కొన్నారు.

Updated Date - 2021-10-05T23:40:01+05:30 IST