ఉద్యోగ సంఘాలతో సజ్జల భేటీ

ABN , First Publish Date - 2021-12-14T20:50:39+05:30 IST

రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాలతో సజ్జల రామకృష్ణారెడ్డి

ఉద్యోగ సంఘాలతో సజ్జల భేటీ

అమరావతి: రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాలతో సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరాతి సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లడుతూ పీఆర్సీ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలతో అంతర్గత భేటీ నిర్వహిస్తున్నామన్నారు. అధికారుల కమిటీ రికమెండ్ చేసిన మొత్తాన్ని మించి ప్రభుత్వం భరించే స్థితిలో లేదని సజ్జల పేర్కొన్నారు. తెలంగాణలో ఐఆర్ ఇవ్వడం లేదన్నారు. అక్కడ రికమెండెషన్స్ అమలు చేయకుండా వాయిదా వేస్తున్నారన్నారు. ఉద్యోగ సంఘాలకు ఏపీ ఆర్థిక పరిస్థితిని వివరిస్తామన్నారు. ఉద్యోగులు సీఎంని కలిసే ముందే మార్గాన్ని సుగమం చేస్తామని సజ్జల తెలిపారు. 




Updated Date - 2021-12-14T20:50:39+05:30 IST