ఏపీలో రామరాజ్యం: బీజేపీ నేతల విమర్శలకు సజ్జల కౌంటర్
ABN , First Publish Date - 2021-12-29T00:32:54+05:30 IST
బీజేపీ నేతల విమర్శలకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. సీఎం జగన్ పాలనపై విజయవాడలో ...
అమరావతి: బీజేపీ నేతల విమర్శలకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. సీఎం జగన్ పాలనపై విజయవాడలో నిర్వహించిన బీజేపీ ప్రజాగ్రహ సభలో ప్రకాశ్ జవదేకర్తో పాటు బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతల వ్యాఖ్యలపై సజ్జల స్పందించారు. టీడీపీ ఏజెంట్లు బీజేపీలో ఉండి జనాగ్రహ సభ పెట్టారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు వెనకుండి ఇదంతా నడిపిస్తున్నారని ఆరోపించారు. ‘‘బీజేపీ ఉనికే తక్కువ టీడీపీ సపోర్ట్ వల్లే ఆ పార్టీ ఉందనుకోవాలి. టీడీపీ నుంచి పోయినవారే బీజేపీలో ఆపరేట్ చేస్తున్నారు. జనసేనలోనూ టీడీపీ వారే ఉండి ఆపరేట్ చేస్తున్నారు. ఏపీలో రామరాజ్యం నడుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మంచి సంబంధాలున్నాయి.’’ అని సజ్జల తెలిపారు.