విభజన చట్టంలో ఉన్న హోదాను ఇప్పటికీ ఇవ్వలేదు: సజ్జల
ABN , First Publish Date - 2022-07-28T03:36:23+05:30 IST
ఏపీకి ఇచ్చిన హామీలను కేంద్రం మొక్కుబడిగానే అమలు చేసిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు.
అమరావతి: ఏపీకి ఇచ్చిన హామీలను కేంద్రం మొక్కుబడిగానే అమలు చేసిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విభజన చట్టంలో ఉన్న హోదాను ఇప్పటికీ ఇవ్వలేదని దుయ్యబట్టారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయనప్పుడు.. అసెంబ్లీ నియోజకవర్గాల పునఃవ్యవస్థీకరణ పెద్ద విషయం కాదన్నారు. హోదాపై నాడు టీడీపీ అధినేత చంద్రబాబు పోరాటం చేసి ఉంటే.. ఇప్పుడు ఎదురుచూడాల్సి వచ్చేది కాదని విమర్శించారు. పోలవరం కాంట్రాక్టుల కోసం చంద్రబాబు ఆశపడ్డారని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం టీడీపీ నేతలే.. విలీన గ్రామాల ప్రజలతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.