బాలినేనిని బుజ్జగించిన సజ్జల
ABN , First Publish Date - 2022-04-10T21:28:14+05:30 IST
మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెళ్లారు. కేబినెట్ కూర్పులో చోటు కల్పించకపోవడంపై బాలినేని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
విజయవాడ: మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెళ్లారు. కేబినెట్ కూర్పులో చోటు కల్పించకపోవడంపై బాలినేని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలిగిన బాలినేనిని బుజ్జగించాలని సజ్జలకు సీఎం జగన్ ఆదేశించారు. సీఎం ఆదేశించడంతో సజ్జల, బాలినేని నివాసానికి వెళ్లి బుజ్జగిస్తున్నారు. 10 నిమిషాల పాటు బాలినేనితో సజ్జల మాట్లాడివెళ్లారు. బాలినేనిని జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కలిశారు. జిల్లాలో సీనియర్గా ఉన్న తనకు మంత్రిపదవి వస్తుందని ఆశిస్తున్నానని ఉదయభాను తెలిపారు. బాలినేనితో ఏ అంశాలూ చర్చించలేదని ఆయన తెలిపారు.
మంత్రివర్గ విస్తరణపై అసంతృప్తి సెగలు రేగుతున్నాయి. మాచర్ల నియోజకవర్గంలో 5 మండలాల వైసీపీ నేతలు సమావేశమయ్యారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోతే..
మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. మంత్రివర్గ విస్తరణపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి రగిలిపోతున్నారు. తన పేరును కనీసం పరిశీలనలోకి తీసుకోలేదంటూ కోటంరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండోసారి గెలిచినా రిక్తహస్తం చూపించారని ఆయన మనస్తాపానికి గురయ్యారు. టీడీపీ ఆశచూపినా కోటంరెడ్డి ఆ పార్టీలోకి వెళ్లలేదని, పార్టీ కార్యక్రమాలతో ప్రతి తలుపు తట్టినా సీఎం జగన్ గుర్తించలేదని కోటంరెడ్డి అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.