సెమీస్కు సైనా
ABN , First Publish Date - 2021-03-27T10:30:22+05:30 IST
ఓర్లీన్స్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది.
శ్రీకాంత్ అవుట్
ఓర్లీన్స్ మాస్టర్స్ బ్యాడ్మింటన్
పారిస్: ఓర్లీన్స్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. టాప్సీడ్ కిడాంబి శ్రీకాంత్ మాత్రం క్వార్టర్స్లోనే ఓడి ఇంటిదారి పట్టాడు. శుక్రవా రం జరిగిన మహిళల సింగి ల్స్ క్వార్టర్స్లో నాలుగో సీడ్ సైనా 21-19, 17-21, 21-19తో ఐరిస్ వాంగ్ (అమెరికా)పై విజయం సాధించింది. గత రెండేళ్లలో నెహ్వాల్ సెమీ్సకు చేరడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
చివరిసారి 2019లో ఇండోనేసియా మాస్టర్స్లో సైనా సెమీ్సలో ఆడింది. కాగా, మరో క్వార్టర్స్లో భారత యువ షట్లర్ ఇరా శర్మ 11-21, 8-21తో లినే క్రిస్టోపెర్సెన్ (డెన్మార్క్) చేతిలో ఓడింది. పురుషుల సింగిల్స్ క్వార్టర్స్లో శ్రీకాంత్ 19-21, 17-21తో అన్సీడెడ్ టోమా జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. పురుషుల డబుల్స్లో కృష్ణప్రసాద్-విష్ణువర్ధన్ జోడీ, మహిళల డబుల్స్లో అశ్వినీ పొన్నప్ప-సిక్కిరెడ్డి ద్వయం, మిక్స్డ్లో అశ్విని-ధ్రువ్ జంట సెమీ్సలో అడుగుపెట్టాయి.