ప్రీక్వార్టర్స్‌కు సైనా, శ్రీకాంత్‌

ABN , First Publish Date - 2020-02-20T10:07:46+05:30 IST

బార్సిలోనా స్పెయిన్‌ మాస్టర్స్‌లో భారత ఏస్‌ షట్లర్లు సైనా నెహ్వాల్‌, కిడాంబి శ్రీకాంత్‌ ప్రీక్వార్టర్స్‌కు చేరుకోగా.. హెచ్‌ఎ్‌స ప్రణయ్‌, పారుపల్లి

ప్రీక్వార్టర్స్‌కు సైనా, శ్రీకాంత్‌

బార్సిలోనా: బార్సిలోనా స్పెయిన్‌ మాస్టర్స్‌లో భారత ఏస్‌ షట్లర్లు సైనా నెహ్వాల్‌, కిడాంబి శ్రీకాంత్‌ ప్రీక్వార్టర్స్‌కు చేరుకోగా.. హెచ్‌ఎ్‌స ప్రణయ్‌, పారుపల్లి కశ్యప్‌ ఇంటిముఖం పట్టారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో సైనా 21-16, 21-14తో యొవెన్నీ లి (జర్మనీ)ని ఓడించింది. పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్‌ 23-21, 21-18తో శుభాంకర్‌ డేపై గెలిచాడు. ప్రణయ్‌ 18-21, 15-21తో ల్యూ డేరెన్‌ (మలేసియా) చేతిలో పరాజయం పాలయ్యాడు. బ్రెజిల్‌ ప్లేయర్‌ యొగెర్‌ కొయలోతో మ్యాచ్‌లో కశ్యప్‌ 21-9, 18-21, 12-14తో ఉన్న సమయంలో రిటైర్డ్‌ హర్ట్‌ అయ్యాడు. మిక్స్‌డ్‌లో ప్రణవ్‌ జెర్రీ చోప్రా-సిక్కిరెడ్డి జోడీ 18-21, 21-16, 21-17తో డెన్మార్క్‌కు చెందిన మాథియస్‌ క్రిస్టియన్‌సెన్‌-అలెగ్జాండ్రా బోయెపై గెలిచింది. 

Updated Date - 2020-02-20T10:07:46+05:30 IST